నాన్న మృతి... 'నాన్నకు ప్రేమతో' ఆడియో పోస్ట్ పోన

No Comments

సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్
హీరోగా నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. రీసెంట్ గా
యుకె లో 90 రోజుల పాటు కంటిన్యూ గా షూటింగ్ లో
జరుపుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల
చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.,
ఈ నేపధ్యంలో ఈ సినిమా ఆడియో డిసెంబర్ 23న విడుదల
చేయటానికి సన్నాహాలు మెదలుపెట్టినా, ప్రస్తుతం వాటిని
నిలిపేసారు. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి
మరణించడం వలన అందరు షాక్ కు గురైయ్యరు..దీనితో
అనుకోకుండా ఈ సినిమా ఆడియో పోస్ట్ పోన్ అయ్యిందని
సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం
లేదు.
చిత్రం విశేషాలకు వస్తే...ఇంకా రెండు పాటలు షూటింగ్
జరగాల్సి ఉంది. దీనితో నిర్మాతలకి జనవరి 13వ విడుదలపై
కూడా సందేహం కలుగుతోంది. ఇప్పటికే ఆడియోని పోస్ట్ పోన్
చేసారు. అభిమానులు మాత్రం ఈ సినిమా గురించి ఆత్రంగా
ఎదురుచుస్తున్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
మాట్లాడుతూ....'విజయదశమి కానుకగా విడుదలైన 'నాన్నకు
ప్రేమతో..' టీజర్కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్
రెస్పాన్స్ వచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రానికి
సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేశాం. లండన్లో 60 రోజులపాటు
ఓ భారీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ
షెడ్యూల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎక్స్ట్రార్డినరీగా
వచ్చాయి ఇక సంక్రాంతి కానుకగా వరల్డ్వైడ్గా ఈ చిత్రాన్ని
విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్ని కొత్త తరహా పాత్రలో
చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే
విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత
స్త్టెలిష్గా కనిపిస్తారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ
బైక్ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా
నిలుస్తుంది''అన్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్
చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు
సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు
సమాచారం.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.